బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులను వెళ్ళనీయకుండా పోలీసులు శుక్రవారం ముందస్తు అరెస్టు చేశారు. జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో బీఆర్ఎస్ నాయకులను వారి నివాసాల వద్ద పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లకు తరలించారు. ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి రెట్టింపు మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందన్నారు. ఈ దుర్మార్గ ప్రభుత్వం గద్దెదిగే వరకు జిన్నారం మండల అధ్యక్షుడు రాజేష్ అన్నారు. అరెస్టు అయిన వారిలో నల్తూరు మాజీ సర్పంచి జనార్ధన్, నాయకులు రామకృష్ణ, శ్రీధర్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్ బ్రహ్మేందర్, రమేష్ తదితరులున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
