Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం……..

కోదాడ పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. సీనియర్ నాయకులు పైడిమరి సత్తిబాబు,పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్ లు స్థానిక నాయకులతో కలిసి కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో కెల్లా భారతదేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని తీర్చిదిద్ది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. నేడు దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన సాగిస్తు ప్రజల పాలిట శాపంగా మారాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు. రాజ్యాంగం ద్వారానే పౌరులందరికీ సమాన హక్కులు లభించాయన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్, సీనియర్ నాయకుడు పైడిమర్రి సత్యబాబు, సంగిశెట్టి గోపాల్, కర్ల సుందర్ బాబు, ఎం.డీ.ఇమ్రాన్ ఖాన్, కాసాని మల్లయ్య గౌడ్ , చీమ శ్రీనివాసరావు, చలిగంటి వెంకట్, నరమనేని శ్రీను, షేక్ ఆరీఫ్, కర్ల నరసయ్య(కమాన్) గొర్రె రాజేష్, షేక్ జానీ, కె.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు…….

Related posts

వృద్ధురాలికి దహన సంస్కారాలు నిర్వహించిన ముస్లిం యువకులు

TNR NEWS

చెరువు కట్టపై కంపచెట్లను తొలగిస్తాం

Harish Hs

నోట్ః ఈ ఐటమ్‌ను తప్పకుండా వాడుకోగలరు విశ్రాంత ఉద్యోగులకు అండగా ఉంటా   రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తా  జోగిపేట మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఆకుల చిట్టిబాబు 

TNR NEWS

జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి.

Harish Hs

కోదాడ మైనార్టీ గురుకుల పాఠశాల సందర్శించిన జిల్లా కలెక్టర్

Harish Hs

తొర్రూర్ లో ‘విశ్వబ్రాహ్మణ వేదవిద్వాన్మహాసభ, పంచదాయిల ఆత్మీయ సమ్మేళనం’  విశ్వబ్రాహ్మణుల ఐక్యతను సమాజానికి చాటి చెప్పాలి  ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు , సంస్కృతి పరిరక్షణలో విశ్వబ్రాహ్మణ పురోహితులు  సనాతన ధర్మ పరిరక్షణలో విశ్వబ్రాహ్మణ వేద పండితుల ప్రధాన పాత్ర : రామ గిరి విక్రమ్ శర్మ 

TNR NEWS