Tnrnews.in
తెలంగాణ

సెయింట్ థెరీసా స్కూల్లో ఘనంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు బడుగు బలహీన విద్యార్థులకు విద్యను అందిస్తున్న మిషనరీ సంస్థ పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి 

 

ఆత్మకూరు మండల కేంద్రంలో ఈరోజు సాయంత్రం సెయింట్ తెరిసా హైస్కూల్లో సిల్వర్ జూబ్లీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన విద్యార్థులకు రాష్ట్రంలోనే ఉత్తమ విద్యను అందిస్తున్న మిషనరీ సంస్థ ఎంతో చాలా గొప్పదని ఈరోజుల్లో విద్యను వ్యాపారం చేస్తూ ఎన్నో ప్రైవేట్ పాఠశాల పుట్టుకొస్తున్నప్పటికీ వాటికి దీటుగా తక్కువ ఫీజులతో ప్రాంతీయ విభేదాలు లేకుండా కుల మతాలు లేకుండా బడుగు బలహీన విద్యార్థులకు తక్కువ ఫీజులతో విద్య అందిస్తున్న ఆత్మకూరు మండలంలోని ఆదర్శంగా నడుస్తున్న పాఠశాల సెయింట్ తెరిసా స్కూల్ అని కొనియాడారు విద్యతోపాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ క్రీడలు ఎన్నో సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న యాజమాన్యానికి ఎంతో అభినందనీయమన్నారు పాఠశాలకు వచ్చే మార్చి బడ్జెట్లో తర్వాత రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాఠశాల యొక్క చరిత్రను వివిధ కల్చర్ ప్రోగ్రాం తో తల్లితండ్రులకు వచ్చిన పెద్దలకు ముఖ్యులకు కండ్ల కట్టినట్టుగా చూపించారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాప్రతినిధులు పాఠశాల యాజమాన్యం అధ్యాపక బృందం తదితరులు అందరు పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బజరంగ్ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బహుమతులు

TNR NEWS

ఎమ్మార్పీఎస్ వెంకటరామాపురం గ్రామ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

Harish Hs

ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ 

TNR NEWS

పలు గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు

TNR NEWS

రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి

Harish Hs

పెన్షనర్స్ భవన్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

TNR NEWS