Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి 

దౌల్తాబాద్: సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వం గుర్తించి వెంటనే రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శేఖర్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ మండల వనరుల కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి ఎంఈఓ కనకరాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం నడుస్తున్న నేటికి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం లేదని అన్నారు. 15 రోజుల్లో సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గాడి రాజు, సంఘం సభ్యులు పెంటయ్య, నగేష్, చంద్రమౌళి, మల్లేశం, కేజీబీవీ సిబ్బంది మమత, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు….

Related posts

గత నాలుగు నెలల నుండి జీతాలు రాక పస్తులు ఉంటున్న ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబాలు

TNR NEWS

తెలంగాణలో ఇవాళ్టి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్‌ !

TNR NEWS

రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి

Harish Hs

నవోదయ ఫలితాల్లో ఎలైట్ క్రియేటివ్ స్కూల్ విద్యార్థి ప్రతిభ

TNR NEWS

నేడు తెలంగాణలో ఈదురుగాలులతో వర్షాలు

TNR NEWS

సీనియర్ జర్నలిస్ట్ ని పరామర్శించిన ఎర్రబెల్లి దయాకర్ రావు 

TNR NEWS