Tnrnews.in
తెలంగాణ

జోగిపేటలో విద్యాసంస్థల బంద్‌ గురుకుల పాఠశాలల్లో ఫుడ్‌ పాయిజన్‌ అయినా పట్టించుకోరా?  ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎర్రోళ్ల మహేష్‌ డిమాండ్‌ 

జోగిపేట: భారత విద్యార్థి ఫెడరేషన్‌( ఎస్‌ఎఫ్‌ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం జోగిపేటలో విద్యాసంస్థల బంద్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎర్రోళ్ల మహేష్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెలరోజులు నుంచి రోజుకొక హాస్టల్, గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్‌ పాయిజన్‌ అయి విద్యార్థులు హాస్పిటల్‌ పాలవుతున్నారని అన్నారు. రాష ్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఫుడ్‌ పాయిజన్‌ అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఆయన అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లును విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి దత్తు రెడ్డి ,జిల్లా కమిటీ సభ్యులు రాజకుమార్,ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ,కృష్ణ, రవి, సాయి, నవీన్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మదీనా తుల్ ఉలూమ్ మదర్సా స్వర్ణోత్సవాలు జయప్రదం చేయాలి…….  కోదాడలో గత 50 ఏళ్లుగా ఆధ్యాత్మిక, సామాజిక విద్యా కేంద్రంగా విరాజిల్లుతున్న మదీనా తుల్ ఉలూమ్ మదర్సా……. జనవరి 4న పూర్వ విద్యార్థుల సమ్మేళనం….. జనవరి 5న భారీ బహిరంగ సభ….మదీనా తుల్ ఉలుమ్ మదర్స స్వర్ణ ఉత్సవాలకు హాజరుకానున్న ఆధ్యాత్మిక గురువులు………

TNR NEWS

రోడ్డును ధ్వంసం చేస్తే చర్యలు తప్పవు…… పెంచికల్ పేట్ ఎస్సై,కొమురయ్య..

TNR NEWS

ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి తొలి రోజు పరీక్ష మొత్తం 2343 మందికి 2339 మంది హజరు …. నలుగురే గైర్హాజరు

TNR NEWS

మునగాల సర్వీస్ రోడ్డు, గణపవరం రహదారిపై దుమ్ములేకుండా చర్యలు తీసుకోవాలి కోదాడ ఆర్డిఓకు వినతిపత్రం అందజేసిన మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సామాజిక కార్యకర్త గంధం సైదులు

TNR NEWS

కలెక్టర్ ని కలిసిన శ్రీకాంత్ రావు

TNR NEWS

ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా దిమ్మెలు నిర్మాణం చెయ్యాలి

Harish Hs