Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా…… మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి….  ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్……

నల్గొండ, వరంగల్,ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జాక్టో మరియు ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ అన్నారు.గురువారం కోదాడ పట్టణంలోని సిసిరెడ్డి పాఠశాలలో జరుగుతున్న జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ను సందర్శించి ఉపాధ్యాయులతో కలిసి మాట్లాడారు.ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. గతంలో ఎన్నో ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించానని, ఇక ముందు కూడా వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలైన పెండింగ్ బిల్లుల మంజూరు, మెరుగైన పిఆర్సి, పెండింగ్ లో ఉన్న డిఏలు మంజూరు చేయించడం, ప్రతి సంవత్సరం బదిలీలు ప్రమోషన్లు జరిపించడం, సిపిఎస్ రద్దు కోసం కృషి చేయడం, కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడం, సమగ్ర శిక్ష ఉద్యోగులకు టైం స్కేల్ ఇప్పించడము, వారి రెగ్యులరైజేషన్ కోసం కృషి చేయడము, ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించడం, 317 జీవో ద్వారా స్థానికత కోల్పోయిన ఉద్యోగులందరికీ న్యాయం చేసేలా కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో జాక్టో నాయకులు ఓరుగంటి నాగేశ్వరరావు, బంధం వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్, కే శ్రీనివాస నాయుడు, రూఫ్ల నాయక్, బి ఆర్ సి రెడ్డి, భూపతి శ్రీనివాస్, నాగయ్య, యలగొండ శ్రీనివాస్, కిరీటం, ఆదినారాయణ, బూర వెంకటేశ్వర్లు, అత్తి వెంకటేశ్వర్లు, మొదలైన వారు పాల్గొన్నారు…….

Related posts

అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం

TNR NEWS

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మొదటి సంత్సరము విద్యార్థీ హత్మహత్య

TNR NEWS

తెలంగాణ జర్నలిస్టులకు సీఎం రేవంత్‌రెడ్డి షాక్‌ ! – కొనసాగుతున్న సమీక్ష సమావేశం  – మళ్ళీ అధికారంలోకి వస్తేనే ఇండ్ల స్థలాలు  – ఇప్పట్లో ఇచ్చేది లేదంటూ పరోక్షంగా వెల్లడి

TNR NEWS

నూతన ఆలయాన్ని ప్రారంభించినసింగరేణి సంస్థ సిఎండి శ్రీ ఎస్ బలరాం

TNR NEWS

టి.ఎస్.యు.టి.ఎఫ్ డిండి మండలం నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవం 

TNR NEWS

మాట ఇచ్చి నిలబెట్టుకున్న నాయకులు బాజపా మండల అధ్యక్షుడు రాజపాల్ రెడ్డి   పసుపు బోర్డు ఏర్పాటు ఫై మోడీ, అరవింద్ చిత్రపటాలకు రైతుల పాలాభిషేకం..

TNR NEWS