Tnrnews.in
తెలంగాణ

మాస్టర్ ప్లాన్ రద్ధు జివో జారీ చేయాలి లేకుంటే ఉధ్యమం తీవ్రతరం

కామారెడ్డి పట్టణ విస్థరణను ఉద్దేశించిన మాస్టర్ ప్లాన్ ను వేంటనే రద్దు చేయాలని రైతు ఐక్య కార్యచరణ కమిటి ప్రతినిధులు డిమాండ్ చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో చూపించిన గ్రీన్ జోన్, ఇండస్ట్రీయల్ జోన్ లలో వ్యవసాయ భూములు చేర్చడాన్ని నిరశిస్తు ఎడాది కాలంగా 8 విలీన గ్రామాల రైతులు అందోళన చేస్తున్న విషయం తెలిసిందే.అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే మాస్టర్ ప్లాన్ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. కామారెడ్డి నూతన మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ జీవో విడుదల చేయాలని మాస్టర్ ప్లాన్ బాధిత 8 గ్రామాల రైతులు ఆదివారం సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో సమావేశమయ్యారు. రైతులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా విలువైన భూములను ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్లో చేర్చిందన్నారు. రైతులు చేపట్టిన ఉద్యమంతో దిగివచ్చిన ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తామని చెప్పినా ఇప్పటివరకు జీవో ఇవ్వలేదన్నారు. మాస్టర్ ప్లాన్ను రద్దు చేస్తూ జీవో ఇవ్వాలని, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లు, అసెంబ్లీ ముట్టడిస్తామని, అరెస్టులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఈనెల 21, 22న దివ్యాంగులకు ఆటల పోటీలు: కె.వి. కృష్ణవేణి

TNR NEWS

సెయింట్ థెరీసా స్కూల్లో ఘనంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు బడుగు బలహీన విద్యార్థులకు విద్యను అందిస్తున్న మిషనరీ సంస్థ పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి 

TNR NEWS

ఉపాధ్యాయ, విద్యారంగా, సామాజిక సమస్యలపై పోరాటమే ఎజెండా

Harish Hs

మహిళా దినోత్సవం సందర్భంగా రూరల్ సీఐ రజిత రెడ్డికి అభినందనలు

Harish Hs

ఉపాధి’ హామీ పథకంలో అవకతవకలు..!

TNR NEWS

కన్నుల పండుగగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం

TNR NEWS