Tnrnews.in
తెలంగాణ

కులాంతర వివాహ ప్రోత్సాహక పథకానికి నిధులు మంజూరు చేయాలి 

గత ఐదు సంవత్సరాల నుండి కులాంతర వివాహం చేసుకున్న వారికీ ఇచ్చే ప్రోత్సహకాలు పెండింగ్లోనే ఉన్నాయని బహుజన ఉద్యమకారుడు రాయరాల సుమన్ అన్నారు. గురువారం మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది కులాంతర వివాహాలు చేసుకున్న లబ్ధిదారులు ప్రోత్సహకాల కోసం చూస్తున్నారని. కుటుంబాలని బంధులని ఎదిరించి వివాహాలు చేసుకున్న దంపతుల నిస్సహాయ స్థితిని కొందరు దుర్మార్గులు ఆసరాగా చేసుకుని,వారి ప్రాణాలు కి ముప్పు తెచ్చి లాభం పొందాలని ప్రయత్నిస్తున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని.ఇటీవల సూర్యాపేట పట్టణంలో పిల్లలమర్రి కాలువ గట్టుపై జరిగిన పరువు హత్య లాంటి సంఘటనలు అత్యంత బాధాకరమని. ప్రభుత్వాలు కులాంతర వివాహ ప్రోత్సాహకాలు 3 నెలల లోపే అందిస్తే దంపతులకు,ఆ ప్రోత్సహక నిధులు చేయూత గా ఉండి, దూర ప్రాంతాలలో సైతం వారి జీవనం సాగించటానికి ఉపయోగ పడతాయని వారన్నారు, కావున తక్షణమే కఠినమైన చట్టాలను ఏర్పాటు చేసి పరువు హత్యలను ఆపాలని అన్నారు.తక్షణమే కులాంతర వివాహం చేసుకున్న వారికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహక నిధులను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బీజేపీ పార్టీలో చేరికలతో జోరుమీదున్న నల్లబెల్లి మండలం – *జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

TNR NEWS

అనంతగిరిలో ఘనంగా తిరంగ యాత్ర

TNR NEWS

చెట్లకు రాఖీలు కట్టిన మున్సిపల్ కమిషనర్ రమాదేవి

TNR NEWS

బీ ఆర్ ఎస్ వి ఆధ్వర్యంలో గురుకుల బాట. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో సమస్యల పైన. గురుకుల పాఠశాలలో సందర్శించాలని బిఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 

TNR NEWS

మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం

TNR NEWS

అమ్మాపురం లో శ్రీకాంతా చారి వర్ధంతి వేడుకలు ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాలను గౌరవించాలి 

TNR NEWS