సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధి బీసీ కాలనీలోని హాజ్రత్ గౌస్ అజామ్ దస్తగిర్ దర్గా’లోని గ్యార్మి ఉత్సవాల్లో ఆదివారం కౌన్సిలర్ చంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు కౌన్సిలర్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సంపత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజు, గౌస్, ఫాసీల్, ఖాధీర్, అఫ్రోజ్, స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
