Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రైతాంగానికి రైతు భరోసా సరే….  వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా ఎక్కడ….  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

పెన్ పహాడ్: రైతాంగానికి ఎకరాకు 12 వేల రూపాయలు ఇచ్చారని మరి భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలనితెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం పెన్ పహాడ్ మండల పరిధిలోని మాసారం గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి భూమిలేని పేదలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి12000 వేల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి17 నెలలు అవుతున్న నేటికీ ఇచ్చిన హామీని అమలు చేసిన పాపాన పోలేదన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. భూభారతి లో అసైన్మెంట్ భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ సర్వేను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ పేద వ్యవసాయ కార్మిక కుటుంబాలకు పంచి ఇవ్వాలన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో రాజకీయ జోక్యాన్ని నివారించాలన్నారు. దళిత, గిరిజన పేదలకు ఇంటి నిర్మాణానికి ఏడు లక్షలు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న వృద్ధులు వితంతులు వికలాంగులు ఒంటరి మహిళలు కొత్త పింఛన్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం తక్షణమే కొత్త పింఛన్లు మంజూరు చేయాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఉపాధి పకాయలు విడుదల చేయాలన్నారు. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకుందాం జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధికి నిధులు పెంచకుండా రెండున్నర లక్షలు ఉపాధి అవసరం ఉండగా బడ్జెట్ 86000 కేటాయించి ఉపాధిని నిర్వీర్యం చేసే చర్యలు చేపడుతుందని సైదులు అన్నారు పని ప్రదేశాలలో కూలీలకు నీడకు టెంటు, కూలీలకు నీడకు త్రాగడానికి మంచినీరు మెడికల్ కిట్టు చిన్నపిల్లల సంరక్షణకు ఆయాను ఉంచటం వంటి సౌకర్యాలు కల్పించాలి ఇలాంటి సౌకర్యాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వై పల్యం చెందాయని వారన్నారు. ప్రభుత్వం పని చూపకపోతే చట్ట ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు.పనిచేసిన కూలీలకు వారం వారం డబ్బులు చెల్లించాలని కోరారు.మెట్ల వ్యవస్థను పునరుద్దించాలి ని అన్నారు.కేరళ వాపక్ష ప్రభుత్వం మోడలుగా పట్టణ ప్రాంత ప్రజలకు ఉపాధి పని వర్తింపజేయాలని పని దినాలు 150 రోజులకు పెంచాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాలు పెంచి నెలవారీగా వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు గుంజ వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కొండమీది రాములు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జిల్లా అదనపు కలెక్టర్ చే సమాచార హక్కు రక్షణ చట్టం 2005 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Harish Hs

సర్వేలు చేస్తున్నారు సరే.. పథకాలేవీ.. పాలనేది? కేటీఆర్ ఘాటు విమర్శలు..!

TNR NEWS

క్వాలిటీ చికెన్ ను అందించి ప్రజల ఆదరణ పొందాలి..

Harish Hs

సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ

TNR NEWS

సర్వేలో తప్పుడు సమాచారమిస్తే కేసులే తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌

TNR NEWS

మంత్రికి పాలాభిషేకం

TNR NEWS