రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం ఆధ్వర్యంలో సిగ్నల్ జంపింగ్ మరియు స్టాప్ లైన్ క్రాసింగ్ గురించి ఎన్.హెచ్.65 సమీపంలో ఈనాడు జంక్షన్ వద్ద వాహన చోదకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతూ సిగ్నల్స్ జంపింగ్, స్టాఫ్ లైన్ క్లాసింగ్ వల్ల వాహనదారులు ఇబ్బందులకు గురవుతారని అన్నారు. కావున సిగ్నల్ జంపింగ్ అనేది లేకుండా సిగ్నల్ పాటిస్తూ స్టాప్ లైన్ క్రాసింగ్ కూడా చూసుకొని వెళ్లాలని వాహన చోదుకులకు ఎస్ఐ సూచించారు. ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది వాహన చోదుకులు ఉన్నారు.

next post