చేర్యాల టౌన్:-
కార్తీకమాసం 11వ రోజు ఏకాదశిని పురస్కరించుకొని కొమురవెళ్లి లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆలయ మహామండప ఆవరణలో సాయంత్రం సమయంలో కార్తీక దీపోత్సవంలో బాగముగా స్వామివారి ఉత్సవ మూర్తుల ఎదుట శ్రీ రుద్ర కవచపటనం,మహా మృత్యుంజయ అక్షరమలా స్తోత్ర పారాయణంగావించి దీపోత్సవం జరిపించారు.ఈ కార్యక్రమములో కొమురవెల్లి గ్రామ మహిళలు,మరియు రాష్ట్రంలోని వివిధ ప్రాంతములనుండి వచ్చిన భక్తులు దీపోత్సవంలో పాల్గొన్నారు.సహాయ కార్యనిర్వహణాధికారి బుద్ధి శ్రీనివాస్ సమక్షంలో పర్యవేక్షకులు, ఆలయసిబ్బంది పాల్గొని భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.అనంతరం ఆలయ అర్చకులు కార్యక్రమములో పాల్గొన్న భక్తులకు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదములు అందజేసి ఆశీర్వదించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
