Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

కష్టపడ్డ ప్రతి కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలోనే పదవులు

 

గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం దళితులను అన్ని విధాలా మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఎస్ సి డిపార్ట్మెంట్ చైర్మన్ కొమ్ము విజయ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దళితులకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని,శుక్రవారం కొండపాక లోని తన నివాసంలో జిల్లా, ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ సి డిపార్ట్మెంట్ స్టేట్ చైర్మన్ ప్రీతం ఆదేశాల మేరకు సిద్దిపేట నియోజక వర్గం నుంచి పలువురికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ ఎస్ సి డిపార్ట్మెంట్ జిల్లా కన్వీనర్ లు, ముత్యాల యాదగిరి, ఎర్ర స్వప్న, అసెంబ్లీ కన్వీనర్ గా బొడ్డు బాలరాజు, జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ గా చేగురి యాదగిరి లను నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పై నమ్మకం తో మాకు బాధ్యతలు అప్పగించిన ప్రీతం కి, జిల్లా అధ్యక్షలు విజయ్ కుమార్ లకు మరియు నియోజక వర్గ ఇంచార్జ్ పూజలు హారికృష్ణ,మరియు సీనియర్ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.

Related posts

కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

Harish Hs

TNR NEWS

సీసీ కెమెరాలను ఏర్పాటుతో నేరాలు నియంత్రణ  – సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి  – బెల్ట్ షాపులు, గుడుంబా అమ్మకాలు పూర్తిస్థాయిలో నివారించాలి – వాహనాలకు ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ పత్రాలు కలిగి ఉండాలి – పరకాల ఏసీబీ సతీష్ 

TNR NEWS

శానిటైజర్ తాగి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

TNR NEWS

ఘనంగా నయా నగర్ వాసుల ఆత్మీయ సమ్మేళనం

TNR NEWS

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

TNR NEWS