March 10, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పీడీఎస్ బియ్యం పట్టివేత…. 8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు….

 

నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యం ను ఇతరుల దగ్గర తక్కువ రేటుకు కొని మహారాష్ట్ర కు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

 

వివరాల్లోకి వెళితే…

 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులకు అందిన పక్కా సమాచారం మేరకు కేరమేరి మండలం లోని వివిధ గ్రామాల నుండి మహారాష్ట్ర కి పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఈ రోజు టాస్క్ ఫోర్స్ పోలీసులు కెరమేరి మండల లోని అనర్పల్లి గ్రామం లో తణిఖీలు చేపట్టారు. అనార్పల్లి గ్రామానికి చెందిన భానోత్.విజయ్ కుమార్ కి చెందిన బొలెరో పికప్ బండి AP 01 Y 0308 ను ఆపి అందులో తనిఖీ చేపట్టగా అందులో అక్రమంగా తరలిస్తున్న 8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంను,పట్టుకొని కేరమేరీ పోలీస్ స్టేషన్ కు తరలించి ఒకరిపై కేసు నమోదు చేసినట్ల్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ తెలిrపారు.

ఈ తనిఖీలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ వెంకటేష్ , టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ రమేష్, సంజీవ్, దేవేందర్ లు పాల్గొన్నారు.

Related posts

సర్వేను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్

Harish Hs

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి

Harish Hs

బహుదొడ్డి రామారావు జీవితం నేటి తరానికి ఆదర్శం- ములకలపల్లి రాములు

Harish Hs

తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను ప్రభుత్వాలు నెరవేర్చాలి…. ఈ నెల 24న సూర్యాపేట నుంచి భద్రాచలం వరకు ఊరూరా ఉద్యమకారుల పాదయాత్ర పాదయాత్ర కరపత్రాలు ఆవిష్కరించిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు సామ అంజిరెడ్డి

TNR NEWS

టి.ఎస్.యు.టి.ఎఫ్ డిండి మండలం నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవం 

TNR NEWS

మేడిపల్లి మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు

TNR NEWS