నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యం ను ఇతరుల దగ్గర తక్కువ రేటుకు కొని మహారాష్ట్ర కు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే…
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులకు అందిన పక్కా సమాచారం మేరకు కేరమేరి మండలం లోని వివిధ గ్రామాల నుండి మహారాష్ట్ర కి పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఈ రోజు టాస్క్ ఫోర్స్ పోలీసులు కెరమేరి మండల లోని అనర్పల్లి గ్రామం లో తణిఖీలు చేపట్టారు. అనార్పల్లి గ్రామానికి చెందిన భానోత్.విజయ్ కుమార్ కి చెందిన బొలెరో పికప్ బండి AP 01 Y 0308 ను ఆపి అందులో తనిఖీ చేపట్టగా అందులో అక్రమంగా తరలిస్తున్న 8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంను,పట్టుకొని కేరమేరీ పోలీస్ స్టేషన్ కు తరలించి ఒకరిపై కేసు నమోదు చేసినట్ల్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ తెలిrపారు.
ఈ తనిఖీలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ వెంకటేష్ , టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ రమేష్, సంజీవ్, దేవేందర్ లు పాల్గొన్నారు.