Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సిపిఎం నేతల అక్రమ అరెస్టు…. విడుదల

మోతే : రైతాంగానికి మద్దతు ధరల చట్టం చేయాలని, స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని, ఎండి పోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం ) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ లో ని ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నాకు వెళుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, సిపిఎం మండల కమిటీ సభ్యులు చర్లపల్లి మల్లయ్య, దోస పాటి శ్రీనివాస్, జంపాల స్వరాజ్యం ను పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేసి వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని అన్నారు. రైతాంగానికి మద్దతు ధరల చట్టం చేయాలని కోరుతూ చలో ఇందిరా పార్కు నిర్వహిస్తున్న సిపిఎం పార్టీ నాయకత్వాన్ని అరెస్టు చేయడానికి ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు. అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని అన్నారు.

Related posts

బిసి ఉద్యమ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

Harish Hs

కోదాడ నియోజకవర్గ ప్రజలకు తొలి ఏకాదశి,మొహర్రం శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

TNR NEWS

నైతిక విద్యతోనే సమాజాభివృద్ధి

Harish Hs

ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బజరంగ్ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బహుమతులు

TNR NEWS

*కులదురహంకార హత్యకి*  *పాల్పడిన నిందితున్ని కఠినంగా శిక్షించాలి…*  *కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి డిమాండ్…*

TNR NEWS

పదోన్నతి పొందిన మాదిగ ఉద్యోగస్తులకు కోదాడ ఎమ్మెల్యే ఘన సన్మానం.

Harish Hs