Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

బిసి ఉద్యమ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

సూర్యాపేట జిల్లాలోని శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర అట్టహాసంగా ప్రారంభమై లింగన్న గట్టుపై దేవర పెట్టే చేరుకోవడంతో దురాజ్ పల్లి జాతర జన సముద్రం అయింది. ఓ లింగా.. ఓ లింగా నామ స్మరణం తో గొల్ల గట్టు మారుమోగింది. సోమవారం గాంధీనగర్ ముద్దుబిడ్డ బీసీ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో భక్త జనం బేరీలతో ర్యాలీ నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ముఖ్య అతిథులుగా బీసీ నాయకులు ఆంధ్ర బొబ్బిలి బోడె రామచందర్ యాదవ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, చిన్న శ్రీశైలం లకు బీసీల యువజన సంఘాల మహిళలు హారతులు ఇచ్చి యాదవుల సంప్రదాయ నాట్యాలతో స్వాగతం పలికారు. అనంతరం లింగమంతుల స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

 *రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతర..*

 

తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర తరువాత రెండో అతిపెద్ద జాతరగా సూర్యాపేట జిల్లా శ్రీ లింగమంతుల స్వామి(గొల్ల గట్టు) జాతర. కేసారం గ్రామం నుండి దేవర పెట్టే గుట్టపై చేరటంతో స్వామి వారి దర్శనం కొరకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. గొల్ల గట్టు జాతర ఈనెల 16 నుండి ప్రారంభమై 20వ తేదీ వరకు ఐదు రోజులపాటు కొనసాగనుంది.

Related posts

క్రెడాస్ సేవలు వినియోగించుకోవాలి 

TNR NEWS

అట్టహాసంగా మునగాల విజ్ఞాన మహోత్సవం

TNR NEWS

రోడ్డు ప్రమాదంలో ఆలమూరు ఎస్సై మృతి

TNR NEWS

జయ స్కూల్ నందు ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు

Harish Hs

ఘనంగా భజరంగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాధుని శోభయాత్ర

TNR NEWS

విద్యార్థుల కు మిఠాయి ల పంపిణి చేసిన అమ్మాపురం గ్రామస్తులు 

TNR NEWS