Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సిపిఎం నేతల అక్రమ అరెస్టు…. విడుదల

మోతే : రైతాంగానికి మద్దతు ధరల చట్టం చేయాలని, స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని, ఎండి పోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం ) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ లో ని ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నాకు వెళుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, సిపిఎం మండల కమిటీ సభ్యులు చర్లపల్లి మల్లయ్య, దోస పాటి శ్రీనివాస్, జంపాల స్వరాజ్యం ను పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేసి వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని అన్నారు. రైతాంగానికి మద్దతు ధరల చట్టం చేయాలని కోరుతూ చలో ఇందిరా పార్కు నిర్వహిస్తున్న సిపిఎం పార్టీ నాయకత్వాన్ని అరెస్టు చేయడానికి ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు. అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని అన్నారు.

Related posts

ఇండియన్ బ్యాంక్ వారి తో సమావేశం నిర్వహించిన.. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమీషన్

TNR NEWS

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

Harish Hs

అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి మతోన్మాదుల నుండి దేశాన్ని రక్షించుకోవాలి  వామపక్ష పార్టీలు డిమాండ్

TNR NEWS

వైకల్య ధ్రువీకరణ పత్రం పొండెందుకు 2016 ఆర్ పి డబ్ల్యు డి చట్టానికి సవరణలు చేయాలనే గెజిట్ ను రద్దు చేయాలి వైకల్య శాతన్ని బట్టి కాకుండా వికలాంగులందరికి ఒకే యు డి ఐ డి కార్డు జారీచేయాలి  ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శు వీరబోయిన వెంకన్న

TNR NEWS

గుడి కందుల ఉన్నత పాఠశాలలో సీసీ కెమెరాల ఏర్పాటు.

TNR NEWS

కోదాడ బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ లో ఘనంగా వసంత పంచమి మహోత్సవం వేడుకలు

Harish Hs