Tnrnews.in
తెలంగాణ

మునగాల ఎంపీఓ గుండెపోటుతో మృతి

మునగాలమండల పంచాయతీ అధికారి(ఎంపీఓ)గా విధులు నిర్వర్తిస్తున్న దార శ్రీనివాస్(53) సోమవారం గుండెపోటుతో మృతిచెందారు.సోమవారం మండలంలోని తిమ్మారెడ్డిగూడెం గ్రామపం చాయతీ కార్యదర్శి జావీద్ ఆహ్వానం మేరకు చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెంలో రంజాన్ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు. భోజనం అనంతరం బాత్రూమ్కు వెళ్లిన శ్రీనివాస్ గుండెపోటుకు గురికావడంతో పంచాయతీ కార్యదర్శులు హుటాహుటిన కారులో కోదాడకు తరలించారు. కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీనివాస్ స్వస్థలం హుజూర్ నగర్ కాగా కోదాడలో స్థిరనివాసం ఉంటున్నారు. ఎంపీఓ శ్రీనివాస్ మృతి పట్ల ఎంపీ డీఓ కె.రమేష్ దీనదయాళ్, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, పలువురు పంచాయతీ కార్యదర్శులు సంతాపం ప్రకటించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ముకుందాపురం బస్టాండ్ వద్ద అండర్ పాస్ నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడాలి

Harish Hs

పుస్తెల తాడు చోరీ కేసులో నిందితులు పట్టివేత

TNR NEWS

కోదాడ రామాలయంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, రూరల్ సీఐ రజిత రెడ్డి ప్రత్యేక పూజలు

TNR NEWS

రేపు తెలంగాణ బంద్‌కి పిలుపునిచ్చిన తీన్మార్ మల్లన్న

TNR NEWS

అక్టోబర్ నాటికి రెడ్లకుంట లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలి

Harish Hs

గ్రూప్ III పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్

Harish Hs