Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

“గత ప్రభుత్వ కాలంలో ఒక్క రేషన్ కార్డూ ఇవ్వలేదు – గంగుల కమలాకర్‌ను అబ్దుల్ రెహమాన్ సూటిగా ప్రశ్నించారు”

కరీంనగర్

నగరంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్‌లో, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన అబ్దుల్ రహమాన్ గారు గంగుల కమలాకర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.

 

అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ, గతంలో సివిల్ సప్లై మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ గారు కరీంనగర్ జిల్లాలో కొత్త రేషన్ కార్డులు ఎంతమంది పేదలకు ఇచ్చారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవల గంగుల గారు ప్రెస్ మీట్‌లో “కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డూ ఇవ్వలేదు” అని చేసిన వ్యాఖ్యలను అబ్దుల్ రెహమాన్ ఖండించారు. ఆయన వివరించగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలలలోనే జిల్లాలో 18,060 అప్లికేషన్లు వచ్చాయిగా, అందులో 11,624 కొత్త తెల్ల రేషన్ కార్డులు మంజూరయ్యాయన్నారు.

 

కరీంనగర్ నియోజకవర్గంలో మాత్రమే 7,413 అప్లికేషన్లలో 4,265 కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. ఇది ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సివిల్ సప్లై ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిలో శ్రీధర్ బాబు, మానకొండూరు ఎమ్మెల్యే కమ్మపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ల సహకారంతో సాధ్యమైందని పేర్కొన్నారు.

 

“మీరు గత పదేళ్లలో ఎంత పనిచేశారో చెప్పండి. బహిరంగంగా శ్వేతపత్రం విడుదల చేయండి” అని గంగుల కమలాకర్‌కు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

 

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మహమ్మద్ అమీర్, సిరిపురం మనోజ్, కాంగ్రెస్ సెక్రటరీ సద్దాం, యూత్ కాంగ్రెస్ సెక్రటరీ కలీం పాల్గొన్నారు.

Related posts

గురుకుల హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ పై ప్రత్యేక దృష్టి – గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలలో ప్రత్యేక చర్యలు – ప్రతిపక్షాలు విద్యార్థుల పట్ల రాజకీయాలు చేయొద్దు – రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

TNR NEWS

ముఖ్యమంత్రిని కలిసిన మాల మహానాడు అనుమకొండ జిల్లా అధ్యక్షులు  ముప్పిడి శ్రవణ్ కుమార్

TNR NEWS

వేసవిలో దాహార్తిని తీర్చడం అభినందనీయం

TNR NEWS

విద్యార్థులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

Harish Hs

మాట ఇచ్చి నిలబెట్టుకున్న నాయకులు బాజపా మండల అధ్యక్షుడు రాజపాల్ రెడ్డి   పసుపు బోర్డు ఏర్పాటు ఫై మోడీ, అరవింద్ చిత్రపటాలకు రైతుల పాలాభిషేకం..

TNR NEWS

మానసిక వికలాంగుల మధ్య జన్మదిన వేడుకలు

Harish Hs