November 18, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మెడిటేషన్ తో ఏకాగ్రత

కే.ఆర్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ మరియు హార్ట్ ఫుల్ నెస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో

విద్యార్థులకు “హెల్ప్” కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 

కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వేముల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా హార్ట్ ఫుల్ నెస్ సంస్థ సెంట్రల్ కో-ఆర్డినేటర్ కె .శివరామ ప్రసాద్ పాల్గొని “ధైర్యము-విశ్వాసం” అనే అంశముపై ఆయన మాట్లాడుతూ… సంకల్ప బలం ఉంటే దేన్నైనా సాధించవచ్చునని, ముఖ్యంగా హార్ట్ ఫుల్ మెడిటేషన్ ద్వారా ఒత్తిడిని తగ్గిస్తుందని, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆత్మబలం, మనోనిబరం పెంచుకోవచ్చు అని ఆయన అన్నారు. ధ్యానము వలన ప్రతి ఒక్కరూ మంచి నడవడిక, సత్ప్రవర్తనను కలిగి ఉండవచ్చును అన్నారు. భూమి నుండి వచ్చే ప్రాణ శక్తితో మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు అని అన్నారు. ధ్యాన శిక్షకులు, హార్ట్ ఫుల్ నెస్ ఆర్గనైజేషన్ కార్యకర్త సి.హెచ్. వెంకటరెడ్డి మాట్లాడుతూ… హెల్ప్ అనే కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచుతూ, మానసిక ఒత్తిడికి దూరమయ్యేలా, పరీక్షలలో విద్యార్థి ఒత్తిడికి గురికాకుండా మెలకువలు చెబుతున్నామని, కళాశాలలో శిక్షణను ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం మూడు రోజులపాటు ప్రతిరోజు ఒక గంట సేపు జరుగుతుందని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వేముల వెంకటేశ్వర్లు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జి. యాదగిరి, వి .బల భీమారావు, జి.నాగరాజు, ఆర్ .రమేష్ శర్మ, రత్నకుమారి,పి. రాజేష్, బి. రమేష్ బాబు, పి. తిరుమల, ఎస్. గోపికృష్ణ, ఎం.చంద్రశేఖర్, ఈ. నరసింహారెడ్డి, ఎస్. కే. ముస్తఫా, ఎస్ .కే .ఆరిఫ్, ఎన్ .రాంబాబు, కె.శాంతయ్య, ఆర్. చంద్రశేఖర్, ఎస్. వెంకటాచారి, జ్యోతి, మమత, డి.ఎస్. రావు విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

మహిళా దినోత్సవం సందర్భంగా రూరల్ సీఐ రజిత రెడ్డికి అభినందనలు

Harish Hs

అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.  సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ 

TNR NEWS

శాంతి భద్రతల పరిరక్షణక కోసమే కార్డెన్ సెర్చ్

TNR NEWS

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

Harish Hs

జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం చేయాలి….. జిల్లా విద్యాధికారి కె. అశోక్ 

TNR NEWS

సిల్వర్ డేల్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి ● ఆ స్కూల్ బస్సుల వరుస ప్రమాదాలపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో, ఎంఈఓ లకు ఫిర్యాదు చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు

TNR NEWS