క్రీడలు ఐక్యతను చాటి చెబుతాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. పోలీస్ వార్షిక స్పోర్ట్స్ మీట్ -2025 ఖమ్మంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానంలో పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత పోలీసు క్రీడాకారుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శాంతి కపోతాలు ఎగురవేసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు.
కమిషనరేట్ పరిధిలోని ఖమ్మం టౌన్ ,ఖమ్మం రూరల్ ,వైరా ,కల్లూరు సబ్ డివిజన్ల సివిల్ పోలీసులు, ట్రాఫిక్, ఆర్మ్ డ్ రిజర్వ్ ఫోర్స్, స్పెషల్ వింగ్స్ స్టాఫ్ మొత్తం 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తున్నారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ నరేష్ కుమార్, అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు, ఏఆర్ అడిషనల్ డీసీపీ విజయ బాబు, ట్రైనీ ఐపిఎస్ రుత్విక్ సాయి, ఏసీపీలు సాంబరాజు, నర్సయ్య, సుశీల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.