Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

కాంగ్రెస్ పాలనలో మిషన్ భగీరథ పై పర్యవేక్షణ కరువు  మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్

కాంగ్రెస్ పాలనలో మిషన్ భగీరథ పై పర్యవేక్షణ కరువైందని మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి *కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపడితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పట్ల నిర్లక్ష్యం వహించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. సూర్యాపేటకు కేటాయించిన నీటిని అక్రమంగా కోదాడకు తరలించక పోతున్నారని మండిపడ్డారు. గతంలో జిల్లా మంత్రిగా గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ప్రతినిత్యం అధికారులతో రివ్యూలు పెడుతూ అధికారులను సమన్వయ చేసి త్రాగునీటి సమస్య లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకునేవారని గుర్తు చేశారు. సూర్యాపేట పట్టణంలో ఏ సమయంలో నల్ల నీరు వస్తుందో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారని తెలిపారు. రానున్న వేసవికాలంను దృష్టిలో పెట్టుకొని త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Related posts

మదర్ థెరిసా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

Harish Hs

కోదాడలో ఘనంగా నాభి శిలా బొడ్రాయి ఏడవ వార్షికోత్సవం

TNR NEWS

మునగాల ఆదర్శ పాఠశాలలో ఘనంగా సైన్స్ డే వేడుకలు

TNR NEWS

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి 

TNR NEWS

లక్షడప్పులు వేయిగొంతులు ప్రచార రథయాత్ర కు హాజరైన ప్రజా యుద్ధనౌక డాక్టర్ ఏపూరి సోమన్న

Harish Hs

గ్రామ స్వరాజ్యం సాధించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి 

TNR NEWS