November 16, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంకు బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలి

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు గడుస్తున్నా నేటి వరకు బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమ్మరకు చెందిన పలువురు రైతులు రైతు సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్డీవో సూర్యనారాయణ ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో రైతులు పండించిన పంటకు ప్రభుత్వం బోనస్ డబ్బులు ఇస్తామని ప్రకటించడంతో తామంతా సహకార సంఘాల ద్వారా ప్రభుత్వానికి ధాన్యం విక్రయించామని నేటికీ రెండు నెలలు గడుస్తున్నా బోనస్ డబ్బులు ఇవ్వకపోవడంతో గ్రామాల్లో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు బోనస్ డబ్బులు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామినేని సతీష్, కనగాల పూర్ణచందర్ రావు, మాతంగి ప్రసాద్, మందారపు వెంకటేశ్వర్లు, సైదులు, వెన్నబోయిన శ్రీను, దంతాల గోపి,శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు……

Related posts

రైతాంగానికి రైతు భరోసా సరే….  వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా ఎక్కడ….  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

TNR NEWS

సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ 

TNR NEWS

రైతులను రారాజుగా చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాల్ రెడ్డి

TNR NEWS

నేడు కోదాడలో మంత్రి పర్యటన

Harish Hs

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వెయ్యాలి.  ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

నూతన ఉపాధ్యాయుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న ఎస్ టి ఓ కొడంగల్ పై చర్యలు తీసుకోవాలి. టీఎస్ యుటిఎఫ్ డిమాండ్.

TNR NEWS