Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంకు బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలి

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు గడుస్తున్నా నేటి వరకు బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమ్మరకు చెందిన పలువురు రైతులు రైతు సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్డీవో సూర్యనారాయణ ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో రైతులు పండించిన పంటకు ప్రభుత్వం బోనస్ డబ్బులు ఇస్తామని ప్రకటించడంతో తామంతా సహకార సంఘాల ద్వారా ప్రభుత్వానికి ధాన్యం విక్రయించామని నేటికీ రెండు నెలలు గడుస్తున్నా బోనస్ డబ్బులు ఇవ్వకపోవడంతో గ్రామాల్లో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు బోనస్ డబ్బులు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామినేని సతీష్, కనగాల పూర్ణచందర్ రావు, మాతంగి ప్రసాద్, మందారపు వెంకటేశ్వర్లు, సైదులు, వెన్నబోయిన శ్రీను, దంతాల గోపి,శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు……

Related posts

నవోదయ ఫలితాల్లో ఎలైట్ క్రియేటివ్ స్కూల్ విద్యార్థి ప్రతిభ

TNR NEWS

ఆర్థిక చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో  బీద కుటుంబానికి టీ స్టాల్ పెట్టించి జీవనోపాధి కల్పించారు

TNR NEWS

*రైతాంగానికి ఏమి చేశారని సంబరాలు…..?*   *కేంద్రం డి ఏ పి ధరలు తగ్గించాలి.*   *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి* 

TNR NEWS

హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎఐసిసి నాయకులు మల్లికార్జున్ కరిగే దిష్టిబొమ్మ దహనం

TNR NEWS

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై దాడి హేయమైన చర్య

Harish Hs

ప్రభుత్వ పథకాలపై కళాకారుల ఆటపాట వివిధ గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న కళాకారులు

TNR NEWS