May 9, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంకు బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలి

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు గడుస్తున్నా నేటి వరకు బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమ్మరకు చెందిన పలువురు రైతులు రైతు సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్డీవో సూర్యనారాయణ ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో రైతులు పండించిన పంటకు ప్రభుత్వం బోనస్ డబ్బులు ఇస్తామని ప్రకటించడంతో తామంతా సహకార సంఘాల ద్వారా ప్రభుత్వానికి ధాన్యం విక్రయించామని నేటికీ రెండు నెలలు గడుస్తున్నా బోనస్ డబ్బులు ఇవ్వకపోవడంతో గ్రామాల్లో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు బోనస్ డబ్బులు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామినేని సతీష్, కనగాల పూర్ణచందర్ రావు, మాతంగి ప్రసాద్, మందారపు వెంకటేశ్వర్లు, సైదులు, వెన్నబోయిన శ్రీను, దంతాల గోపి,శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు……

Related posts

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

Harish Hs

ఆర్టీసీ బస్సులో పొగలు

TNR NEWS

జర్నలిస్టులకు అండగా టీజేయు – కప్పర ప్రసాద్ రావు – ఘనంగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం 

TNR NEWS

చింతకాయల వీరయ్య మృతి బాధాకరం

Harish Hs

న్యాయవాది పై జరిగిన దాడికి నిరసనగా కోర్టు విధులు బహిష్కరణ

TNR NEWS

2026 జనవరి 25 నుండి 28 వరకు హైదరాబాదులో జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 14 వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి… ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి….

TNR NEWS