వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో 76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి, జిల్లా పోలీస్ కార్యాలయం పైన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా ప్రజలు,పోలీసు అధికారులు మరియు సిబ్బందికి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆకాంక్షిస్తూ స్వేచ్చ, స్వాతంత్ర్యాల వెనక ఎంతో మంది పోరాటయోదుల త్యాగం దాగి ఉన్నదని గుర్తు చేసారు. మన వంతు భాద్యతగా దేశసేవ కొరకు పాటుపడాలని, పోలీసు అధికారులు సిబ్బంది తమ విధులను భాద్యతాయుతంగా నిర్వహించి పోలీస్ వ్యవస్థకు మంచి పేరు,ప్రతిష్టలు తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ టివి.హనుమంత్ రావు గారు,ఏఓ జోతిర్మని, వికారాబాద్ డిఎస్పి శ్రీనివాస్ , డిసిఆర్బి డిఎస్పి జానయ్య , ఏఆర్ డిఎస్పి వీరేష్ , ఏఆర్ డిఎస్పి వీరేశ్, డిఎస్బి ఇన్స్పెక్టర్ డివిపి రాజు ,ఆర్ఐ అంజాత్ పాషా , కమ్మునికేషన్ ఇన్స్పెక్టర్ టి.శ్రీను తదితరులు పాల్గొనడం జరిగింది.

next post