Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను రిజిష్టర్ లో నమోదు చేయాలని రైతుల నుంచి ధాన్యం సేకరించిన వెంటనే వారికి తప్పనిసరిగా రసీదులు అందించాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. బుధవారం మునగాల మండల పరిధిలోని బరాకత్ ‌ గూడెం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో తేమ శాతాన్ని పరిశీలించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ధాన్యం సేకరణలో జాప్యానికి తావు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతులు తెచ్చిన ధాన్యం నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్నట్లయితే, వెంటనే తూకం జరిపి, నిర్దేశిత రైస్ మిల్లులకు పంపడం జరుగుతోందని అన్నారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని రైతులకు సూచించారు. అకాల వర్షాలు ఉన్నందున ధాన్యం రాశులు తడవకుండా పట్టాలు కప్పుకోవాలని రైతులకు సూచించారు. ‌ఈ కార్యక్రమంలో ఆయన వెంట తహసిల్దార్ ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, శ్వేత, ఏ ఈ ఓ రేష్మి,పి ఎస్ ఎస్ సిఓ బసవయ్య సెంటర్ ఇంచార్జ్ సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ ఆమోదిత దినోత్సవ వేడుకలు* ….

Harish Hs

వర్గల్ మండల కేంద్రాన్ని సందర్శించిన ఎస్ఐ కరుణాకర్ రెడ్డి

TNR NEWS

ముత్యాలమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం 

TNR NEWS

నేటి సాంకేతికత రేపటికి సాంకేతికత కు పునాది  ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది… జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు  బాల వైజ్ఞానిక ప్రదర్శనలు సృజనాత్మకతకు ప్రతీకలు ఉపాధ్యయులు ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలి  కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ సహకారంతో వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం భళా… బాలల సైన్స్ ప్రయోగాలుజిల్లా విద్యాశాఖ చరిత్రలో కోదాడ విద్యా బాల వైజ్ఞానిక ప్రదర్శన మైలు రాయి….డీఈఓ అశోక్

TNR NEWS

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతీ

TNR NEWS

కార్యదర్శులు అప్పులపాలు..!!

TNR NEWS