Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

అధ్వాన్న స్థితిలో దౌల్తాబాద్ పాఠశాల.

స్వచ్ఛభారత్ స్వచ్ఛ తెలంగాణ అంటూ మరుగుదొడ్లు నిర్మించిన పాలకులు ప్రభుత్వ పాఠశాలల వైపు కన్నెత్తి చూడడం లేదు. మూత్రశాల, మరుగుదొడ్ల వసతి లేక బాలికలు పాఠశాలలకు దూరమైపోతున్న దృష్టితీ నెలకొన్నది , దేశ భవిష్యత్తును తిరగరాసి బాలలు అక్షరాలు దిద్దే పాఠశాలలో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక అవస్థలు పడుతున్న ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామంలో బాలుర ప్రాథమిక పాఠశాల పరిస్థితి ఇది . దౌల్తాబాద్ గ్రామంలో ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కనీస వసతులు లేవు పాఠశాలలోని మరుగుదొడ్లు, మూత్రశాలలు శిథిల వ్యవస్థలో ఉన్నందున పనిచేయక వాటిని వినియోగించడం లేదు, నీటి సదుపాయం కూడా లేదు, కొత్తవి నిర్మించారు, సగంలోనే అసంపూర్తిగా వదిలేశారు. విద్యార్థులు బహిరంగ మూత్ర విసర్జన చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లకు వెళ్లాల్సి వస్తే సుమారు కిలోమీటర్ ఇంటికి వెళ్లి తిరిగి పాఠశాలకు వచ్చే పరిస్థితి ఉంది. మూత్రశాలలు సరిగ్గా లేక పాఠశాల ఆవరణలో మూత్ర విసర్జన చేయడంతో కీటకాలు ఏర్పడి విద్యార్థులు అనారోగ్య పాలవుతున్నారు. ఇక తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు లేవు అనే చెప్పుకునే ప్రభుత్వం కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్న దౌల్తాబాద్ పాఠశాలలో విద్యార్థులను పట్టించుకోకపోవడం పై విమర్శలు చెందుతున్నాయి. సంబంధిత అధికారి, ఈ పాఠశా ను పర్యవేక్షించలేదని ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సంబంధిత అధికారులకు విద్యార్థులు పడే అవస్థలు కనిపించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. దానితో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. కానీ విద్యార్థులకు కల్పించాల్సిన మౌలిక వసతులు ప్రభుత్వం కల్పించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు వెంటనే మరుగుదొడ్లు మూత్రశాలలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Related posts

ముత్యాలమ్మ తల్లి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి

Harish Hs

అదుపుతప్పి ముక్త్యాల బ్రాంచ్ కాలువలో పడిన ఆటో పలువురికి గాయాలు

TNR NEWS

ఏ బస్సు చూసిన కాలేశ్వర పుష్కరాళ్లకే         మంథని బస్టాండ్ లో ప్రయాణికులు ఇబ్బంది ఉచితలకు అలవాటు పడ్డ ప్రజలు

TNR NEWS

రైతాంగానికి రైతు భరోసా సరే….  వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా ఎక్కడ….  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

TNR NEWS

కార్యకర్తలను కలుపుకొని బిజెపిని గెలుపు తీరాలకు చేరుస్తా… -పెద్దపల్లి మండల నూతన అద్యక్షుడు రమేష్

TNR NEWS

పంది తిరపయ్యకు పితృవియోగం

Harish Hs