Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

దాడి చేసి క్షమాపణ చెబితే సరిపోతుందా..! జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి.. తక్షణమే మోహన్ బాబును అరెస్టు చేయాలంటూ డిమాండ్… ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు

మీడియా స్వేచ్ఛను హరించేలా కొందరు ప్రముఖులు ప్రవర్తిస్తున్నారని, దాడి చేసి సారీ చెబితే సరిపోతుందా అని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు ప్రశ్నించారు.

శుక్రవారం ఆయన మాట్లాడుతూ…. సినీ ప్రముఖుల వారి కుటుంబ విషయాలను బయట పడేలా… పోలీస్ స్టేషనులకు ఫిర్యాదులు చేసుకున్నప్పుడు, ప్రజలలో పాపులారిటీ ఉన్న వారిపై, తప్పనిసరిగా మీడియా ప్రతినిధులు ఫోకస్ చేస్తారని, ఆ క్రమంలోనే మోహన్ బాబు ఇంట్లో జరిగినటువంటి గొడవలకు సంబంధించి సమాచారాన్ని ప్రజలకు అందజేస్తున్న క్రమంలో టీవీ9 జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబ, ఆయన వ్యక్తిగత సిబ్బందిగాయపరచడంారహితంగా దాడి చేసి గాయపరచడం హేయమైన చర్య అన్నారు. దాడి చేసి సారీ చెప్పి చేతులు దులుపుకుంటే సరిపోతుందా అని ఆయన మండిపడ్డారు. కనీసం ఆసుపత్రికి వెళ్లి జర్నలిస్టులు పరామర్శించలేదని, జర్నలిస్ట్ అంటే మరి అంత చిన్న చూపు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకొని తక్షణమే మోహన్ బాబును అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

కాశిబుగ్గ వివేకానంద కాలనీలో పారిశుద్ధ పనులు 

TNR NEWS

ఉచిత విద్యుత్ కోసం కొత్త రేషన్ కార్డుదారులు ఇలా చేయండి

TNR NEWS

తాత్కాలికంగా మండల పరిషత్ కార్యాలయంలోకి సబ్ కోర్టు………

TNR NEWS

ప్రజా సంస్కృతిక సంబరాలను జయప్రదం ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల వెంకన్న

TNR NEWS

బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ 

TNR NEWS

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన..మాజీ సర్పంచ్ దారబోయిన నర్సింహ యాదవ్

TNR NEWS