Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావు

 

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలం చిన్న కోడఫ్గల్ లో కొత్తగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనాన్ని మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.ఆయన మాట్లాడుతూ..రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని సహకార సంఘాల బలోపేతమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం నిజాంసాగర్ మండలం మాగీ గ్రామంలో రైతు శిక్షణ కేంద్రం, సమావేశ గదితో పాటు కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఏక కాలంలో రుణ మాఫీ చేయడం అసాధ్యమని గత ప్రభుత్వం చెప్పిన అంశాన్ని సుసాధ్యం చేసిన ప్రజా ప్రభుత్వం ఇది అని చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమం లో సొసైటీ ఛైర్మన్ నాగిరెడ్డి,మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్,మద్నూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ సాయిరెడ్డి, వెంకట్ రామ్ రెడ్డి, ఆదిల్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉప ముఖ్యమంత్రి పవన్ ని కలిసిన మాజీ ఎమ్మెల్యే పెండెం

TNR NEWS

అక్రమంగా 34 గోవులను తరలింపు పట్టుకున్న భజరంగ్ దళ్ శ్రేణులు..గోవులను పోలీస్ స్టేషన్ కి తరలించారు

TNR NEWS

నేటి నుంచి ‘గ్రూప్‌-4’ వెరిఫికేషన్‌..!!

TNR NEWS

బీజేపీ పార్టీలో చేరికలతో జోరుమీదున్న నల్లబెల్లి మండలం – *జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

TNR NEWS

అనాధ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

Harish Hs