Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రీడా వార్తలుతెలంగాణ

రాష్ట్రస్థాయి పోటీలకు 25 మంది విద్యార్థుల ఎంపిక 

 

డిసెంబర్ 1న మంచిర్యాల లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు 25 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. మెట్ పల్లి పట్టణంలోని మినీ స్టేడియంలో బుధవారం జగిత్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోటీలలో జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన 980 మంది విద్యార్థులు పాల్గొనగా మున్సిపల్ కమిషనర్ రణవేని సుజాత జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 25 మంది విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఉత్తమ క్రీడాకారులకు రణవేణి నితిన్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మెరిట్ సర్టిఫికెట్స్ తో పాటు మెడల్స్ బహుకరించారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ తరపున పోటీలలో పాల్గొన్న క్రీడాకారులందరికీ సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆనంద్ బాబు అసోసియేషన్ సెక్రెటరీ ఏలేటి ముత్తయ్య రెడ్డి, ఉపాధ్యక్షులు గజెల్లి రాందాస్, కొమురయ్య, ఆల్ రౌండర్ గంగాధర్, శంకర్, కార్తీక్, అశోక్, ప్రశాంత్, రవళి, మధులిత తదితరులు పాల్గొన్నారు.

Related posts

గ్రూప్ 3 ఎగ్జామ్స్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ లో అడిషనల్ కలెక్టర్ రాంబాబు

Harish Hs

పేదల డబ్బా కోట్లకు నోటీసులు ఇవ్వడం అన్యాయం……

Harish Hs

రైతు భరోసా, బోనస్ డబ్బులను వెంటనే చెల్లించాలి

Harish Hs

కోదాడ వాసికి డాక్టరేట్

TNR NEWS

ఓదెల లో లేబర్ కార్డు ఉన్నవారికి ఉచిత వైద్య పరీక్షలు ఓదెల గ్రామం మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ ఆధ్వర్యంలో

TNR NEWS

దివ్యాంగులకు ట్రై సైకిల్లు పంపిణీ…

TNR NEWS