Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం.. —కేంద్రాల్లోనే రైతులకు వెంటనే ధాన్యం రశీదులు.. —48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. —సన్నవడ్లకు బోనస్ చెల్లింపు.. –ఎమ్మెల్యే విజయరమణ రావు…

 

పెద్దపల్లి మండలం రంగాపూర్, దేవునిపల్లి గ్రామాల్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం రోజున స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కొనుగోలు చేసిన ధాన్యానికి కేంద్రాల్లో రైతులకు రశీదులు ఇస్తున్నామని తెలిపారు. రైతులకు 48 గంటల్లో ధాన్యం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సన్న వడ్లకు క్వింటాలుకు 500 రూపాయల చొప్పున బోనస్ 5 రోజుల్లో రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ చెల్లిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రైతులెవరు అధైర్యపడవద్దని సన్నవడ్లు సాగు చేసుకున్న ప్రతి ఒక్కరికి బోనస్ అందుతుందని హామీ ఇచ్చారు. రానున్న యాసంగిలో తెగుళ్లను తట్టుకునే వరి రకాలను సాగు చేసుకోవాలని రైతులకు వివరించారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఎలాంటి కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి గింజకు మద్దతు ధర చెల్లించి వడ్లను కొనుగోలు చేఇస్తామని చెప్పారు. రైతులకు ఎక్కడ మోసం జరిగినా సహించేది లేదని హెచ్చరించారు. గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు వడ్ల కటింగ్ పేరిట రైతులను నిలువునా ముంచారని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో ఛైర్మన్ చింతపండు సంపత్, మాజీ జడ్పీటిసి బండారి రాంమూర్తి, , మాజీ సర్పంచులు, గంట రమేష్, కలబోయిన మహేందర్,,కౌన్సిలర్లు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బొక్కల సంతోష్, అశోక్, నరేందర్, సరయూ, సతీష్,కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి దినపత్రికలు. జిల్లా అదనపు కలెక్టర్ చేతుల మీదగా రాజముద్ర తెలుగు దినపత్రిక నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ

TNR NEWS

హుజూర్ నగర్ మున్సిపాలిటీ 25వ వార్డులో సామాజిక సర్వేలో పాల్గొన్న ఆర్డీవో

TNR NEWS

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం

Harish Hs

జాబితాపూర్ లో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

TNR NEWS

కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగస్టు 13న జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.  ఎస్కేయం జిల్లా కన్వీనర్ మండారి డేవిడ్ కుమార్

TNR NEWS

ప్రజా ఆరోగ్యాలకు తీవ్ర నష్టం కలిగించేఇథానాల్ ఫ్యాక్టరీని ఎత్తి వేసే వరకు ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలి.  తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీరాష్ట్ర కన్వీనర్ కన్నెగంటి రవి

TNR NEWS