Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రైస్ మిల్లుల కాలుష్యం నుండి ప్రజలను కాపాడాలి

రైస్ మిల్లుల నుంచి వెలువడే కాలుష్యం నుండి తమను కాపాడాలని కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మర,లక్ష్మీపురం కాలనీ ప్రజలు మంగళవారం సూర్యపేట జిల్లా కలెక్టర్, నల్గొండ పొల్యూషన్ బోర్డు అధికారులను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్ మాట్లాడుతూ కోదాడ,ఖమ్మం జాతీయ రహదారిని అనుకోని వున్నా శ్రీ లక్ష్మీ శ్రీనివాస, రాధాకృష్ణ, రాజ్యలక్ష్మి, శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఇండస్ట్రీ, పార్ బాయిల్డ్ రైస్ మిల్లుల నుంచి మురుగునీరు, బూడిద వ్యర్థ పదార్థాలతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని శ్వాస కోస సమస్యలు తలెత్తుతున్నాయని అదేవిధంగా రోడ్డుపై వెళ్లే వాహనదారులు బూడిద కళ్ళలో పడి అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. తాము మిల్లుల యజమానులను కలిసి ఎన్ని సార్లు విన్నవించిన సమస్యను పరిష్కరించడం లేదన్నారు. కావున అధికారులు కలుగజేసుకొని వెంటనే స్పందించి మిల్లులను మూసి వేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో వారి వెంట బొల్లు ప్రసాద్, సిరిపురపు హేమ, సట్టు వీరస్వామి, వెలీదే పద్మ, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు…….

Related posts

ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి. సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ.

Harish Hs

గజ్వేల్ పట్టణంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు – పీసీసీ అధికార ప్రతినిధి శ్రీ బండారు శ్రీకాంత్ రావు

TNR NEWS

ప్రభుత్వ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

TNR NEWS

ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలి

Harish Hs

డివైడర్‌ను ఢీకొట్టిన బైక్‌.. వ్యక్తి మృతి

TNR NEWS

పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన డీఏవో

TNR NEWS