Tnrnews.in
తెలంగాణ

వరి పొలాన్ని పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు

మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామంలో జినెక్స్ కంపెనీకి చెందిన చిట్టి పొట్టి రకం విత్తనాలు నాటిన 45 రోజులకి ఈని కంకులు వస్తున్నాయని ఫిర్యాదు రావడం వలన ఆ వరి పొలాలను మంగళవారం కోదాడ వ్యవసాయ సహాయ సంచాలకులు ఎల్లయ్యతో, పాటు మండల వ్యవసాయ అధికారి రాజు పరిశీలించారు. గత రెండు మూడు సంవత్సరాల నుంచి యాసంగి సీజన్ లో ముందుగా వరి నాట్లు వేసిన పొలాల్లో, ఇలా కొన్ని కంపనీ లకు చెందిన సన్న గింజ రకాలకు ముందుగానే కంకులు రావడం జరుగుతుందని తెలిపారు.ఈ విధంగా 45 రోజులకే కంకులు రావడం గల కారణాలను కనుగొనడానికి,ఇది విత్తన నాణ్యత లేకపోవడం వలన జరిగిందా? లేక
వాతావరణ పరిస్థితుల వలన జరిగిందా?
అనేది పూర్తి అంచనా కోసం శాస్త్రవేత్తలను రప్పిస్తామని వారు ఆ పంట పొలాలను పరిశీలన చేసిన తర్వాత, వారిచ్చే తుది నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి భవాని, రైతులు కోలా ఉపేందర్, శివకృష్ణ, మహేష్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

TNR NEWS

ఈ నెల 20 తర్వాత వర్షాలకు ఛాన్స్…!

TNR NEWS

ఆల్ ఇండియా బిసి, ఎస్ సి, ఎస్ టి, మైనారిటీ సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా తూర్పు రమేష్

TNR NEWS

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి రాజీ మార్గమే రాజమార్గం – ఎస్సై ప్రవీణ్ కుమార్

TNR NEWS

ఇక డిగ్రీ రెండున్నరేళ్లే.. వచ్చే ఏడాది నుంచి అమలు: UGC చైర్మన్

TNR NEWS

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని రైతులను వెంటనే విడుదల చేయాలి బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు కుర్ర సావిత్రి

TNR NEWS