Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రైస్ మిల్లుల కాలుష్యం నుండి ప్రజలను కాపాడాలి

రైస్ మిల్లుల నుంచి వెలువడే కాలుష్యం నుండి తమను కాపాడాలని కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మర,లక్ష్మీపురం కాలనీ ప్రజలు మంగళవారం సూర్యపేట జిల్లా కలెక్టర్, నల్గొండ పొల్యూషన్ బోర్డు అధికారులను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్ మాట్లాడుతూ కోదాడ,ఖమ్మం జాతీయ రహదారిని అనుకోని వున్నా శ్రీ లక్ష్మీ శ్రీనివాస, రాధాకృష్ణ, రాజ్యలక్ష్మి, శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఇండస్ట్రీ, పార్ బాయిల్డ్ రైస్ మిల్లుల నుంచి మురుగునీరు, బూడిద వ్యర్థ పదార్థాలతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని శ్వాస కోస సమస్యలు తలెత్తుతున్నాయని అదేవిధంగా రోడ్డుపై వెళ్లే వాహనదారులు బూడిద కళ్ళలో పడి అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. తాము మిల్లుల యజమానులను కలిసి ఎన్ని సార్లు విన్నవించిన సమస్యను పరిష్కరించడం లేదన్నారు. కావున అధికారులు కలుగజేసుకొని వెంటనే స్పందించి మిల్లులను మూసి వేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో వారి వెంట బొల్లు ప్రసాద్, సిరిపురపు హేమ, సట్టు వీరస్వామి, వెలీదే పద్మ, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు…….

Related posts

సందడిగా సంక్రాంతి ముగ్గుల పోటీలు

Harish Hs

నేడు మున్నూరు కాపు సభను విజయవంతం చేయాలి

TNR NEWS

తెలంగాణ రాష్ట్ర మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా చిర్రా శ్రీనివాస్

Harish Hs

రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి

TNR NEWS

కోదాడలో గ్యాస్ సిలిండర్ దొంగ అరెస్ట్

Harish Hs

టిజిపిఎస్ గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా పగడ్బందీగా నిర్వహించాలి.

Harish Hs