Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించి వాహనాలు నడపాలి ఎస్సై గణేష్

ముస్తాబాద్ మండల కేంద్రంలో రోడ్డు భద్రతపై అవగాహనలో భాగంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని వాహనదారులకు ఎస్సై గణేష్ ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాల్ రెడ్డి బిజెపి నాయకులు యువకులు పాల్గొని హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల మండలంలో 25 సంవత్సరాల లోపు యువకులే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారని ఎస్సై గణేష్ తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలని.బైక్‌పై వెళ్లినప్పుడు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని, కారులో ప్రయాణించేటప్పుడు సీటు బెల్ట్‌ ధరించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాంగ్‌ రూట్‌లో ప్రయాణించరాదన్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ బైక్‌పై, కారులో ప్రయాణం చేసేటప్పుడు సెల్‌ఫోన్‌లో మాట్లాడడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాలకు ముప్పు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి. పాక్స్ డైరెక్టర్ కరెట్ల కొండల్ రెడ్డి. కోల్ల కృష్ణ. సద్ది మధు తోట ధర్మేందర్. ఉచ్చిడి బాల్ రెడ్డి వరి వెంకటేష్. శీల ప్రశాంత్. మిడిదొడ్డి భాను. రంజాన్ నరేష్. తాళ్ల విజయ్. పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

సందడిగా సంక్రాంతి ముగ్గుల పోటీలు

Harish Hs

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ కు ఘన సన్మానం

Harish Hs

జోగిపేట ఎన్టీఆర్‌ స్టేడియంలో అన్ని వసతులు కల్పిస్తా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ.దామోదర్‌ రాజనర్సింహ క్రికెట్‌ విజేతలకు బహుమతుల ప్రధానం 

TNR NEWS

ఐకెపి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్

TNR NEWS

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Harish Hs

నెహ్రూ ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్లాలి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

TNR NEWS