అక్రమంగా కబేళాలకు తరలిస్తున్న 34 గోవులను భజరంగ్ దళ్ శ్రేణులు ములుగు పట్టుకున్నారు. సిద్దిపేట వైపు నుండి హైదారాబాద్ కి వీటిని తరలిస్తున్నట్లుగా తెలిసింది. గోవులను పోలీస్ స్టేషన్ కి తరలించారు.వైద్య పరీక్షల అనంతరం ఈ 34 గోవులను గోశాలకు తరలించినున్నట్లుగా భజరంగ్ నేతలు చెప్పారు ర్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా చట్టాల అమలుతో గోవద నిర్మూలనకు కృషి చేస్తుండగా అక్రమార్కులు మాత్రం పట్టించుకోకుండా యధేచ్చగా తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రభుత్వం ఈ తరలింపుకు అడ్డుకట్టవేసేలా చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా ఈ గోవులను తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు.