సూర్యాపేట జిల్లా మునగాల మండలం జగన్నాధపురం గ్రామ పరిధిలో బుధవారం ఆర్టీసీ బస్సులో పొగలు రావడంతో అప్రమత్తమైన కండక్టర్ డ్రైవర్ బస్సులో ఉన్న స్కూలు విద్యార్థులను ప్రయాణికులను సురక్షితంగా బస్సులో నుంచి బయటకి పంపించారు, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని కండక్టర్ డ్రైవర్ తెలిపారు విషయం తెలుసుకున్న గ్రామ పంచాయతి కార్యదర్శి అనిత, మాజీ సర్పంచ్ భీష్మారావు గ్రామపంచాయతీ ట్రాక్టర్ సహాయంతో విద్యార్థులను స్కూలుకు పంపించారని విద్యార్థి తల్లిదండ్రులు గ్రామస్తులు తెలిపారు.
