కోదాడ మండల పరిధిలోని అశోక్ నగర్ లో గల స్థానిక శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల అనాధాశ్రమంలో సోమవారం చిలుకూరు కు చెందిన అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ చిలుకూరు మండల అధ్యక్షులు
అనంతుల రాము, ఉష దంపతుల కుమార్తె ఆనంతుల చెన్విత 10 వ పుట్టినరోజు వేడుకలను అనాధ పిల్లల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాధ,మానసిక వికలాంగుల పిల్లల మధ్య తమ కుమార్తె జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్నారు.అనాధ పిల్లలకు తన వంతు సహాయ సహకారాలుఎల్లవేళలా ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
