Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

వేసవి ఎండల్లో కిలో వాట్స్ విద్యుత్ భారాలు తగవు – పౌర సంక్షేమ సంఘం డిమాండ్

కాకినాడ : వేసవిలో అధికంగా వుండే గృహవిద్యుత్ వాడకాన్ని సంపద సృష్టికి ఆసరాగా చేసుకుని గృహ విద్యుత్ వినియోగదారులపై రాయితీలు ప్రకటిస్తూ అదనపు లోడ్  భారాలు మోపడం తగదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది.  కిలో వాట్ కు రూ.1200లు మించితే రూ.2,450  రెండు కిలో వాట్స్ దాటితే రూ.3,650లు అదనంగా వసూలు చేసేందుకు టార్గెట్స్ పెట్టడం అంట కత్తెర  చోద్యంగా వుందన్నారు.  ట్రూఅప్ తదితర తాడు బొంగరం లేని అదనపు చార్జెస్ పేరిట విద్యుత్ బిల్లులు అధికం కాగా, వేసవి ఎండల్లో కిలో వాట్ టార్గెట్స్  తగదన్నారు. ట్రాన్స్ కో ప్రకటించిన 50శాతం రాయితీ  వేసవికి అడ్వాన్స్డ్ క్షవర కళ్యాణంగా వుంద న్నారు. యూనిట్ రేట్లు ఇప్పటికే అధికంగా వున్నందున అదనపు  భారాలు రెండు కిలో వాట్స్ వరకు గృహ వినియోగదారులపై  లేకుండా రద్దు చేయాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఘనంగా కుక్కుటేశ్వరుడి శ్రీ పుష్ప యాగం

మార్కెట్ యార్డ్ కార్య వర్గ సమావేశం

TNR NEWS

కాకినాడ కార్పోరేషన్ త్రాగునీటి సరఫరాకు చేరుతున్న గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయి

Dr Suneelkumar Yandra

పిఠాపురంలో రూ.40 లక్షలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

బల్లిపాడు మరియు పైడిపర్రు గ్రామాలకు చేరిన “గ్రీన్ మెడిసిన్”

TNR NEWS

బహుజనుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి కాన్షీరాం

Dr Suneelkumar Yandra