May 8, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

పంట నష్టపరిహారం కచ్చితంగా ఇవ్వాల్సిందే -కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ 

మోతె, నవంబర్ 5 ( TNR NEWS ) : రైతులు పండించిన పంటలకు నష్టపరిహారం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఖచ్చితంగా ఇవ్వాలని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మోతె మండల పరిధిలోని సర్వారం గ్రామంలో ఇటీవల తుఫాన్ కారణంగా నేలమట్టమైన పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలన చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ వర్షాల కారణాలతో పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కచ్చితంగా ఇవ్వాల్సిందే అని రైతులకు అత్యంత త్వరలోనే రైతు భరోసాని ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఐకెపి కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసిన ధాన్యం రైతులు నష్టపోకుండా తేమశాతం చూడకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు లేని ఎడల మా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్,జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు,మిక్కిలినేని సతీష్ బాబు,పల్స మల్సూర్, రైతులు తదితరులు పాల్గొన్నారు

Related posts

అమ్మాపురం లో ఉచిత కంటి పరీక్ష శిబిరం 

TNR NEWS

*మాలల సింహాగర్జనను విజయవంతం చేయాలి* ● సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పలు గ్రామాల్లో సింహగర్జన వాల్ పోస్టల్ ఆవిష్కరణ

TNR NEWS

భీముని పాదం జలపాతాన్ని అభివృధి కి సహకరిస్తా జాతీయ ఎస్టి కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్

TNR NEWS

ఏఐఎస్ఎఫ్ నాయకుల ముందస్తు అరెస్టు

TNR NEWS

తాటి చెట్టు పై నుంచి పడి వ్యక్తికి గాయాలు

TNR NEWS

అట్టహాసంగా మునగాల విజ్ఞాన మహోత్సవం

TNR NEWS