Tnrnews.in
తెలంగాణ

*విద్యార్థులకు పాఠాలు బోధించిన సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్*

విద్యార్థులు కనబడగానే ఉపాధ్యాయుడిగా మారిపోతారు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.

సూర్యాపేట జిల్లా, జాజిరెడ్డిగూడెం మండలం, రామన్నగూడెం ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు.

4, 5వ తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ఇంగ్లీష్, తెలుగు, గణితం పాఠాలు చెప్పారు.

విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ప్రత్యక్షంగా పరిశీలించి, బోర్డు మీద గణిత లెక్కలు చేయించారు.

విద్యార్థుల సమాధానాలను ప్రశంశిస్తూ సంతోషంగా బహుమతులను అందజేశారు.

ఉపాధ్యాయులైన ధర్మయ్య, నీరజ, సుధారాణి, వెంకన్నలను వారి సత్కార్యానికి అభినందించారు.

“విద్యార్థుల ప్రతిభ ఉపాధ్యాయుల కృషిని ప్రతిబింబిస్తుంది. ఇలాగే బోధిస్తూ మంచి పేరు సంపాదించండి” అని సూచించారు.

ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, గణితం, ఇంగ్లీషులో ప్రాథమిక పట్టు అవసరమని తెలిపారు.

ఎక్కడికైనా పర్యటనకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా ఒక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మమేకమవుతారు.

అభ్యసన సామర్థ్యాల పరిశీలనతోపాటు బాగా చదివే విద్యార్థులకు నాట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేసి ప్రోత్సహించారు.

జిల్లా కలెక్టర్ వెంట డిఎస్ఓ మోహన్ బాబు, డిఎం రాము, తహసీల్దార్ శ్రీకాంత్, ఆరి శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు ధర్మయ్య మరియు ఉపాధ్యాయనీలు హాజరయ్యారు.

“చదువే అభివృద్ధికి మూలం” అనే విశ్వాసంతో విద్యా వాతావరణాన్ని బలోపేతం చేస్తున్నారు కలెక్టర్…

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

టీఎన్జీవో ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

TNR NEWS

మట్టి వినాయకుణ్ణి పూజించండి… పర్యావరణాన్ని కాపాడండి – పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

Dr Suneelkumar Yandra

కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఏపూరి తిరపమ్మ సుధీర్..

TNR NEWS

కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

Harish Hs

ఆర్టీసీ బస్సులో పొగలు

TNR NEWS

అర్హత గల ప్రతీ వ్యక్తికి రేషన్ కార్డ్  – 40లక్షల కొత్త రేషన్ కార్డులిస్తాం.. – జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

TNR NEWS