Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

భక్తుల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు

  • ఆలయ సహాయ కమీషనర్‌ కాట్నం జగన్మోహన శ్రీనివాస్‌

 

పిఠాపురం : ఎండలు ఎక్కువుగా వుండడంతో ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం వారి దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన పాదగయా క్షేత్రం శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి మరియు సహాయ కమీషనర్‌ కాట్నం జగన్మోహన శ్రీనివాస్‌ తెలిపారు. ఈ చలివేంద్రంలో మజ్జిగ, త్రాగునీరు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వేసవి కాలంలో ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఆలయ ఆవరణలో చలువపందిర్లు ఏర్పాటు చేశామన్నారు. 216 జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఆలయం కావడంతో రోడ్డుపై వెళుతున్న వాహనదారులు కూడా ఈ చలివేంద్రాన్ని వినియోగించుకోవచ్చని ఆలయ కార్యనిర్వాహణాధికారి మరియు సహాయ కమీషనర్‌ కాట్నం జగన్మోహన శ్రీనివాస్‌ తెలియజేశారు. వేసవి కాలం ముగిసేవరకు ఈ చలివేంద్రం కొనసాగిస్తామన్నారు.

Related posts

తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ: ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్:*

TNR NEWS

ఏఎస్ఆర్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

Dr Suneelkumar Yandra

గొల్లప్రోలులో అడ్డగోలుగా అక్రమ లేఅవుట్లు – చోద్యం చూస్తున్న అధికారులు

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.

TNR NEWS

తెలంగాణలో కొత్త రైల్వే డివిజన్..!!

TNR NEWS

స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణదిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ – జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు