Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

భక్తుల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు

  • ఆలయ సహాయ కమీషనర్‌ కాట్నం జగన్మోహన శ్రీనివాస్‌

 

పిఠాపురం : ఎండలు ఎక్కువుగా వుండడంతో ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం వారి దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన పాదగయా క్షేత్రం శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి మరియు సహాయ కమీషనర్‌ కాట్నం జగన్మోహన శ్రీనివాస్‌ తెలిపారు. ఈ చలివేంద్రంలో మజ్జిగ, త్రాగునీరు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వేసవి కాలంలో ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఆలయ ఆవరణలో చలువపందిర్లు ఏర్పాటు చేశామన్నారు. 216 జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఆలయం కావడంతో రోడ్డుపై వెళుతున్న వాహనదారులు కూడా ఈ చలివేంద్రాన్ని వినియోగించుకోవచ్చని ఆలయ కార్యనిర్వాహణాధికారి మరియు సహాయ కమీషనర్‌ కాట్నం జగన్మోహన శ్రీనివాస్‌ తెలియజేశారు. వేసవి కాలం ముగిసేవరకు ఈ చలివేంద్రం కొనసాగిస్తామన్నారు.

Related posts

21న పిఠాపురం కు సిపిఐ రాష్ట్ర నేత కే రామకృష్ణ రాక

Dr Suneelkumar Yandra

రాజ్యాధికారమే మాస్టర్ కి, అంబేద్కర్ మార్గంలో ముందుకు సాగాలి

Dr Suneelkumar Yandra

వైభవముగా చండీ హోమము

Dr Suneelkumar Yandra

దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మున్సిపల్ సిబ్బంది

TNR NEWS

రాష్ట్ర ర్యాంకులతో మొదటి ప్రయత్నంలోనే శ్యామ్ విద్యార్థులు

Dr Suneelkumar Yandra

పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపు పూర్తి

TNR NEWS