పిఠాపురం : ఆంధ్రప్రదేశ్ విధానమండలి సభ్యులుగా (ఎమ్మెల్సీ) ప్రమాణస్వీకారం చేసి తొలిసారి పిఠాపురం పర్యటనకు విచ్చేసిన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబుని చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పి.వి.ఎస్.ఎన్.రాజు పిఠాపురంలోమర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నాగబాబుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ తొందరలోనే చోడవరం నియోజవర్గం పర్యటనకు రమ్మని కోరడం జరిగింది. ఈ ఆహ్వానానికి స్పందించిన నాగబాబు అతి త్వరలోనే విశాఖపట్నం పర్యటనలో భాగంగా చోడవరం విచ్చేస్తానని, జనసైనికులను, వీర మహిళలను కలుస్తానన్నారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సంక్షేమానికి కలిసి పని చేద్దామన్నారు. ఈ సందర్భంగా చోడవరం నియోజకవర్గంలో ప్రజలకోసం, పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న పి.వి.ఎస్.ఎన్.రాజుని నాగబాబు అభినందించారు.

previous post
next post