పిఠాపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ అగ్నిమాపక వారోత్సవాలు అగ్నిమాపక అధికారి డి.రామకృష్ణ రాజు ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా జగయ్య చెరువులో గల రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ నందు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వంట వండుతున్నప్పుడు గ్యాస్ వాడటంలో తీసుకోవాల్సిన చర్యలు అగ్ని ప్రమాదం జరిగితే ఎలా తప్పించుకోవాలో, వెంటనే అగ్నిమాప సిబ్బందికి సమాచారం ఇవ్వాలని తగు జాగ్రత్తలు తీసుకోవడం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి డి.రామకృష్ణరాజు అగ్నిమాపక సిబ్బంది, గృహిణిలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

previous post