Tnrnews.in
తెలంగాణరాజకీయం

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి.  రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలి.  ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి.  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్

సూర్యాపేట టౌన్: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎలుగురి గోవింద్ డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురం లో జరిగిన సిపిఎం పార్టీ వన్ టౌన్ కమిటీసమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజలు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం వెంటనే వేగవంతం చేసి ఇల్లు లేని పేదలకు ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా చేయాలన్నారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎంపిక చేసే విధానాన్ని రద్దు చేయాలన్నారు. నియోజకవర్గానికి 3500 ఇస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారని అవి ఏ మూలకు సరిపోవు అన్నారు. నియోజకవర్గానికి పదివేల ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇండ్ల నిర్మాణం పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల కు నేటికీ బిల్లులు రాలేదని ప్రభుత్వం వెంటనే వాటికి కూడా బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటి స్థలం లేని ప్రజలు ఎక్కువగా ఉన్నారని ప్రభుత్వం తక్షణమే భూమి కొనుగోలు చేసి ఇంటి స్థలం లేని పేదలకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని వెంటనే అమలు చేయాలని కోరారు. రేషన్ కార్డులు లేక గత పది సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ప్రకటనకు మాత్రమే పరిమితమైంది తప్ప సంవత్సర కాలంగా ఒక్కరికి కూడా రేషన్ కార్డు మంజూరు చేసిన పాపాన పోలేదు అన్నారు. తక్షణమే అర్హులందరికీ రేషన్ కార్డు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఈ సమావేశంలో సిపిఎం పార్టీ వన్ టౌన్ పట్టణ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ మామిడి పుల్లయ్య పిట్టల రాణి ఒట్టే ఎర్రయ్య కప్పల సత్యం మాధగోని మల్లేష్ టేకుల సుధాకర్ రాచూరి జానకిరాముల పోతురాజు లక్ష్మి మారయ్య గోపయ్య తదితరులు పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ కు ఘన సన్మానం

Harish Hs

కమ్మ కులస్తులు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలవాలి

Harish Hs

హెచ్ సి యు భూముల వేలాన్ని ఆపాలి

Harish Hs

మెద్వాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు

TNR NEWS

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇన్విజిలేటర్లు ఓఎంఆర్ షీట్లపై తప్పుడు హాల్ టికెట్ నెంబర్లు బబ్లింగ్ చేసిన వైనం.. తప్పు తెలుసుకుని దిద్దడంతో ఓఎంఆర్ షీట్ కి బొక్క… ఇష్టానుసారం గా వ్యవహరిస్తున్న ఇన్విజిలేటర్లు పై చర్యలు తీసుకోవాలి… నవోదయ సెంటర్ ముందు ఆందోళన చేసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు… టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు…

TNR NEWS

పలు కుటుంబాలను పరామర్శించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి

TNR NEWS