Tnrnews.in
తెలంగాణ

కార్యకర్తలను కలుపుకొని బిజెపిని గెలుపు తీరాలకు చేరుస్తా… -పెద్దపల్లి మండల నూతన అద్యక్షుడు రమేష్

పెద్దపల్లి మండలంలోని కార్యకర్తలను ప్రతీ ఒక్కరిని కలుపుకొని భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించేలా చేసి గెలుపు తీరాలకు చేరుస్తానని ఆ పార్టీ పెద్దపల్లి మండల నూతన అధ్యక్షుడిగా నియమితులైన వేల్పుల రమేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. బిజెపి సంస్థాగత పర్వంలో భాగంగా నిమ్మనపల్లి గ్రామానికి చెందిన రమేష్ ను పెద్దపల్లి మండల నూతన అధ్యక్షుడిగా జిల్లా ఎన్నికల అధికారి అయ్యన్నగారి భూమన్న గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, పార్టీ ఎదుగుదల కోసం పనిచేసే ప్రతీ కార్యకర్తకు బిజెపిలో గుర్తింపు లభిస్తుందనడానికి తన నియామకమే నిదర్శనమని అభిప్రాయపడ్డారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి అసెంబ్లీ ఇన్చార్జి శ్రీ దుగ్యాల ప్రదీప్ కుమార్ గారికి, జిల్లా ఎన్నికల అధికారి అయ్యన్నగారి భూమన్న, జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి, పర్వతాలు, ఆరుముల్ల పోషం, సంపత్ రావు, తంగెడ రాజేశ్వర్ రావు, బూతు అధ్యక్షులకు తదితరులకు రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ, రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు

TNR NEWS

మహిళల భద్రత కోసమే షీ టీమ్స్

Harish Hs

యువత స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలి

Harish Hs

పేకాట రాయుళ్ల అరెస్ట్..

Harish Hs

*రైతులు IKP కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి – కీసర సంతోష్ రెడ్డి.*

Manideep

గడువు లోపు ఓటర్ గా నమోదు చేసుకోండి… మద్నూర్ తహసిల్దార్ ఏం డి ముజీబ్

TNR NEWS