Tnrnews.in
తెలంగాణ

తహసిల్దార్ కార్యాలయంలో ఫైర్ పై అవగాహన  :ఫైర్ ఫై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి  : తహసిల్దార్ సంతోష్ కిరణ్

కోదాడ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికల 99 రోజులలో భాగంగా స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో అగ్నిమాపక అధికారి కందుల డాక్టర్ బాబు ఆధ్వర్యంలో ఫైర్ ఫై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ సంతోష్ కిరణ్ పాల్గొని అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు డీసీపీ, సిఓటును ఎలా ఉపయోగించాలో మాక్ ఢిల్లీ ద్వారా చూయించారు. అనంతరం తహసిల్దార్ మాట్లాడుతూ మనం విధులు నిర్వహిస్తున్న కార్యాలయాలలో, మనం నివసిస్తున్న ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆ ప్రమాదాలను నివారించడానికి పాటించవలసిన నిబంధనలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మీరు ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరుగుతున్న దాన్ని చూసినట్లయితే తక్షణమే 101 కి కాల్ చేసి ఆ అగ్ని ప్రమాదాన్ని నివారించడానికి సహకరించాలని అన్నారు. ఈ వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశాలు ఉన్నందున ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా రైతులు పంట పొలాలలో గడ్డిని తగలబెట్టడం వలన రోడ్ల వెంబడి చెట్లు అలాగే గడ్డివాములు కొన్ని ప్రాంతాలలో ఇల్లు అగ్ని ప్రమాదానికి గురి అవుతున్నాయి కావున రైతులు పొలాలలో గడ్డిని తగలబెట్టకుండా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది రఫీ, నాగార్జున, మోహన్, జగన్, నాయకులు భాషాబోయిన భాస్కర్, ఫైర్ సిబ్బంది జి శ్రీనివాసరావు, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

TNR NEWS

భారత పర్యటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను వెంటనే ఉరితీయాలి

Harish Hs

ఇందిరమ్మ ఇండ్ల సర్వే సమగ్రంగా నిర్వహించాలి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలి  మండల కాంగ్రెస్ పార్టీనాయకులు మండవ చంద్రయ్య

TNR NEWS

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

TNR NEWS

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టి పెల్లి సైదులు ఎన్నిక

TNR NEWS

తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ సిఐ

TNR NEWS