Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

దివ్యాంగుల అనాధాశ్రమానికి లక్ష రూపాయల విరాళం అందజేత

కోదాడకు సమీపంలోని అశోక్ నగర్ లో గల స్థానిక శనగల రాధాకృష్ణ మానసిక దివ్యాంగుల అనాధాశ్రమానికి కోదాడ పట్టణానికి చెందిన వీరేపల్లి వెంకట సుబ్బారావు వారి సతీమణి రుక్మిణమ్మ జ్ఞాపకార్థంగా లక్ష రూపాయల విరాళంను కోదాడలోని వారి నివాసంలో సంస్థ నిర్వాహకులు శనగల జగన్మోహన్ కు అందజేశారు. అమెరికాలో స్థిరపడిన వారి కుమారుడు వీరేపల్లి వెంకటేశ్వరరావు సతీమణి స్మిత తో కలిసి కోదాడ కు వచ్చిన సందర్భంగా ఈరోజు దివ్యాంగుల అనాధాశ్రమాన్ని సందర్శించి అనాధలను మానసిక దివ్యాంగులను చేర దీసి ఆశ్రయం కల్పిస్తున్న నిర్వాహకులు శనగల జగన్మోహన్ ను వారు ప్రత్యేకంగా అభినందించారు. దివ్యాంగులకు, సంస్థకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు……..

Related posts

వరంగల్: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అఘోరి 

TNR NEWS

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

Harish Hs

సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి

Harish Hs

TNR NEWS

కొమురవెళ్లి మల్లన్న సన్నిధిలో కార్తీక ఏకాదశి ఉత్సవం

TNR NEWS

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Harish Hs