November 16, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పందుల కపరులపై మునిసిపల్ కమిషనర్ చెస్తున్న దాడులు ఆపాలి

నారాయణపేట జిల్లా మద్దూర్ మునిసిపల్ కేంద్రంలోని తహిసిల్దార్ కార్యాలయం ముందు ఎరుకలి పందుల పెంపకందారులు మరియు ప్రజాసంఘాలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పందుల పెంపకందారుడు బలప్ప మాట్లాడుతూ మేము పందులను పెంచుకొని జీవనోపాధి పొందుచున్నాము అయితే మద్దూరు మున్సిపాలిటి కమీషనర్ గారు మమ్ములను రెనివట్లలో మరియు మద్దూరులో పందులను పెంచవద్దని చెప్పుచున్నారు. మమ్ములను నిన్న అనగా తేది 22.10.2025 రోజు కమీషనర్ గారు పిలిపించి మమ్ములను పందులను పెంచుకోవద్దు అన్నారు. మేము కమీషనర్ గారికి పందులపై ఆధారపడి జీవిస్తున్నాము అని లేకపోతే మాకు జీవనోపాధి లేదు అని చెప్పాము మరియు మీరు పందులను పెంచవద్దు అంటే మేము చనిపోతాం. మాకు బతుకు లేదు అని అంటే అప్పుడు కమీషనర్ గారు మీరు చనిపోండి అని భయపెట్టినాడు. మాకు ప్రత్యామ్నాయ ఉపాధి చూయించండి అని మేము కొరినము అప్పుడు పందులను తీసివేస్తాము అని చెప్పినాము. మాకు వందుల పెంపకం కొరకు ప్రభుత్వ భూమిలో కొంత భూమికి కేటాయించగలరని కోరడం జరిగింది మరియు మాకు వేరే ఉపాధి చూయించగలరని కొరినము, కానీ కమిషనర్ గారు మా మాటలను పాటించుకోకుండా పోలీసులను పెట్టి మేములను కోటిస్తా సోమవారం వరకు గడువు లేకపోతే పందులు మందుపెట్టి సముపుతా అంటూ అలాగే ఎరుకలి వాళ్లు మీరు ఏంచేస్తారు అంటూ బెదిరించారని అన్నారు

సీపీఎం పార్టీ ఏరియా కరియదర్శి గోపాల్, సీపీఎం( ఎం ఎల్ ) నాయకులు కె. నర్సింహులు మద్దతు ఇచ్చి వారు మాట్లాడుతూ పందుల పెంపకదారులపై చేస్తున్న దాడులను అరికట్టాలని కమిషనర్ పందుల పెంపకదారులపై ఇష్టానుసారంగా భయపెడుతూ బెదిరించిన మున్సిపల్ కమీషనర్ పై చర్య తీసుకొనగలరని ఏసీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఈ సమస్యపై కలెక్టర్ దృష్టికి తీసుకెలాలని తహిసిల్దార్ కి వినతి ద్వారా కోరారు తదనంతరం జీవనోపాధి అయిన పందుల పెంపకంను కొనసాగించుటకు అవకాశము కల్పించగలరాని మరియు వారికి ప్రత్యామ్నయ ఉపాధి అవకాశాలు కల్పించ గలరని కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మొహ్మద్ అలీ, ఎరుకలి పందుల పెంపకందరుల సంఘం నాయకులు అంజి, కిష్టప్ప, కృష్ణ, రాములు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

కోదాడ లో మొట్ట మొదటి మల్టీ బ్రాండ్ ఆఫ్టికల్ స్టోర్ సిటి ఆప్టికల్స్

Harish Hs

నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవు

Harish Hs

పలు గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు

TNR NEWS

సోమవారం ప్రజావాణి రద్దు  వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం రద్దు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

TNR NEWS

సన్న వడ్లకు బోనస్ పై రైతుల హర్షం కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముస్కుల సురెందర్ రెడ్డి

TNR NEWS

భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే బాధ్యత గురువులది ‌

TNR NEWS