May 19, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కందాల శంకర్ రెడ్డి ఎన్నిక…

సూర్యాపేట: తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన కందాల శంకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గురువారంఒక ప్రకటనలో తెలిపారు. ఈయన గతంలో విద్యార్థి, యువజన సంఘాలలో పనిచేశారు. గత 35 సంవత్సరాలుగా ప్రజాతంత్ర ఉద్యమంలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్నారు. అనేక కేసులు, నిర్బంధాలను, శత్రువుల దాడులను తట్టుకొని ఉద్యమానికి అంకితమై ప్రజాతంత్ర ఉద్యమ బలోపేతానికి ఎంతో కృషి చేశారు.1983లో ఖమ్మం జిల్లా గోకినపల్లిలో జరిగిన ఎస్ఎఫ్ఐ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులలో పాల్గొని దాని స్పూర్తితో ప్రజా ఉద్యమాలలో అంకితమై పనిచేస్తున్నారు. అమరవీరులు తొట్ల మల్సూర్, కందాల మల్లారెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రజా ఉద్యమాలలో భాగస్వామ్యం అవుతూ రైతులకు గిట్టుబాటు ధర కోసం, ఐకెపిలో నెలకొన్న సమస్యలపై, అకాల వర్షాలు,వరదలు, వడగళ్ల వానలు, యూరియా కొరత వంటి రైతాంగ సమస్యల పరిష్కారం కోసం అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. తన ఎన్నికకు సహకరించిన తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.

Related posts

ప్రజా పాలన కళాయాత్ర ప్రారంభం జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా డిసెంబర్ -7 దాకా కొనసాగనున్న కళాయాత్ర ఉత్సవాలు

TNR NEWS

కోదాడ లో మొట్ట మొదటి మల్టీ బ్రాండ్ ఆఫ్టికల్ స్టోర్ సిటి ఆప్టికల్స్

Harish Hs

వడ్ల కోనుగోలు కేంద్రం ప్రారంభం

TNR NEWS

అర్హులకు పథకాలు అందేలా సర్వే చేయాలి  అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత 

TNR NEWS

బాధితుల ఇంటి వద్ద నుండి తొలి FIR నమోదు చేసిన సూర్యాపేట జిల్లా పోలీస్. _ఇంటి వద్దే FIR.. తొలి కేసు నమోదు చేసిన సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీసులు.

TNR NEWS

దామరగిద్దలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

TNR NEWS