Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

దివ్యాంగుల అనాధాశ్రమానికి లక్ష రూపాయల విరాళం అందజేత

కోదాడకు సమీపంలోని అశోక్ నగర్ లో గల స్థానిక శనగల రాధాకృష్ణ మానసిక దివ్యాంగుల అనాధాశ్రమానికి కోదాడ పట్టణానికి చెందిన వీరేపల్లి వెంకట సుబ్బారావు వారి సతీమణి రుక్మిణమ్మ జ్ఞాపకార్థంగా లక్ష రూపాయల విరాళంను కోదాడలోని వారి నివాసంలో సంస్థ నిర్వాహకులు శనగల జగన్మోహన్ కు అందజేశారు. అమెరికాలో స్థిరపడిన వారి కుమారుడు వీరేపల్లి వెంకటేశ్వరరావు సతీమణి స్మిత తో కలిసి కోదాడ కు వచ్చిన సందర్భంగా ఈరోజు దివ్యాంగుల అనాధాశ్రమాన్ని సందర్శించి అనాధలను మానసిక దివ్యాంగులను చేర దీసి ఆశ్రయం కల్పిస్తున్న నిర్వాహకులు శనగల జగన్మోహన్ ను వారు ప్రత్యేకంగా అభినందించారు. దివ్యాంగులకు, సంస్థకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు……..

Related posts

పోలీసులకు, ఉద్యమకారుల మధ్య  తోపులాట…  ఉద్రిక్తం…  ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకుల అక్రమ అరెస్టు, విడుదల  అనుమతులన్నింటినీ రద్దు చేసేంతవరకుఐక్యంగా ఉద్యమిస్తాం … ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నేతలపిలుపు….

TNR NEWS

వెంకటరెడ్డి మృతి బాధాకరం:టీపీసీసీ డెలిగేటు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి

Harish Hs

పొగ మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు

Harish Hs

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తుల సమస్యలను సత్వరం పరిష్కరించాలి – పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్

TNR NEWS

ఘనంగా కార్తీక దీపోత్సవం

TNR NEWS

అంబేద్కర్ ఆశయాలను ఆచరిద్దాం -రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్ట రాజు

TNR NEWS